చొప్పదండి, ఏప్రిల్ 26: పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నామని, ప్రజలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అభివృద్ధికి చేసింది శూన్యమని విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆదివారం సాయంత్రం చొప్పదండి పట్టణంలో నిర్వహించే కేటీఆర్ రోడ్ షోకు నియోజకవర్గంలోని ప్రజలు అత్యధికంగా తరలిరావాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య -వినయ్ కుమార్, సింగిల్ విండో అధ్యక్షుడు మినుపాల తిరుపతిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు గడ్డం చుకారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక్ రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ కొత్తూరు మహేశ్, డాక్టర్ అమిత్ రావు, నాయకులు నల్లమాచు రామకృష్ణ, కొత్తూరు నరేశ్ , గుడిపాటి వెంకటరమణారెడ్డి, జహీర్ మావురం మహేశ్, అనిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.