పెద్దపల్లి, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన గులాబీ కార్యకర్త గజభీంకార్ మనోహర్ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏ ఎన్నిక వచ్చినా మద్దతుగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేళ ఫ్లెక్సీపై 17 మంది ఎంపీ అభ్యర్థుల ఫొటోలను ముద్రించుకొని, ఆ ఫెక్సీని తన ఒంటిపై వేసుకున్నాడు. అలాగే చేతిలో హ్యాండ్ మైక్ పట్టుకొని, ఆ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాలినడకన తిరుగుతూ పాటలను మైకు ద్వారా వినిపిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.