దోమకొండ, మే 17 : తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు రవాణా, మిల్లర్ల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంతోపాటు సంగమేశ్వర్, లింగుపల్లి గ్రామాల్లో కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైసుమిల్లులకు తరలించాలని ఆదేశించారు. తేమ శాతం 17కు తక్కువ కాకుండా చూసుకోవాలన్నారు. కేం ద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా లేబర్ను ఏర్పాటు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఆధైర్యపడవద్దని కోరారు. ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమచేసేలా వివరాలు త్వరితగతిన ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కేంద్రాల్లో టార్పాలిన్లు, తాగునీరు, నీడ వసతిని ఏర్పాటు చేయాలన్నారు. సమస్యను విన్నవించిన వెంటనే కేంద్రాలను పరిశీలించడంపై కలెక్టర్కు జడ్పీటీసీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చంద్రమోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ పన్యాల నాగరాజురెడ్డి, వైస్ ఎంపీపీ బాపురెడ్డి, సర్పంచ్ సాయిలు, తహసీల్దారు శాంత, ఏవో పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నప్పటి నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి
జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కామారెడ్డి రక్తదాతల సమూ హం, ఐవీఎఫ్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని అన్నారు. రక్తదానానికి విద్యార్థులు ముందుకు రావడం, రక్తదాతలు 14 ఏండ్ల నుంచి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు, డివిజన్ సెక్రటరీ జమీల్ హైమద్, కామారెడ్డి రక్తదాతల అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాశ్, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేశ్గుప్తా, గోవింద్, భాస్కర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అభినయ, అధ్యాపక బృందం, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.