ఆర్మూర్టౌన్, మే 4: బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో శనివారం పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి జీవన్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ను ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు. అబద్ధాల పార్టీ కాంగ్రెస్ను ఎందుకు గెలిపించారో అర్థం కావడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు నెలల్లో కూలిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. లోక్సభ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.