ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 10: పేదవారి ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13,86,500 విలువ చేసే చెక్కులను శనివారం కామారెడ్డిలోని తన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటివరకు 608 మందికి రూ.3 కోట్ల 96 లక్షల 64 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అనారోగ్యానికి గురైన వారితో పాటు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందిన వారు దవాఖాన బిల్లులతో దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ మంజూరవుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీరప్ప ఉత్సవాలకు ఆహ్వానం..
దోమకొండ, ఏప్రిల్ 10: మండల కేంద్రంలో ఈనెల 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే బీరప్ప ఉత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్ గోవర్ధన్ను కుర్మ సంఘం సభ్యులు, నాయకులు ఆహ్వానించారు. ఈమేరకు వారు విప్ గోవర్ధన్ను కామారెడ్డిలోని ఆయన నివాసంలో శనివారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. విప్ను ఆహ్వానించిన వారిలో జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, టీఆర్ఎస్ నేతలు నర్సయ్య, నల్లపు శ్రీనివాస్, మల్లేశం, సుధాకర్, కుర్మ సంఘం సభ్యులు బుచ్చమెల్ల నర్సింహులు, గునోల్ల నర్సింహులు, నాగరాజయ్య ఉన్నారు.