చిట్యాల: ఆధునిక వ్యవసాయంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతోగానో ఉపయోగపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. మండలంలోని నైన్పాక, జూకల్ గ్రామాల్లోని రైతు వేదికలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఏవో నాలికె రఘుపతి ఆధ్వర్యంలో రైతువేదికల్లో వేరు వేరుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు తమ సాగు అనుభవాలను తోటి వారితో పంచుకునేందుకు రైతు వేదికలు ఉపయోగ పడుతాయన్నారు.
వ్యవసాయ పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతువేదికలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు సాగుపై ఆసక్తి చూపేవారు కాదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలతో రైతాంగం క్షణం తీరిక లేకుండా సాగుపనుల్లో నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఎక్కువ మొత్తంలో ఓకే రకం పంటలు విత్తకుండా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే లాభాలు వస్తాయని, ఆయిల్ఫామ్ పంటలపై రైతులు దృష్టిసారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోదా, జెడ్పీటీసీ గొర్రె సాగర్, రైతుబందు సమితి మండల కోఆర్డినేటర్ నల్ల సమ్మిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి, సీడీపీవో అవంతి సర్పంచులు తొట్ల లక్ష్మి, పుట్టపాక మహేందర్, వైస్ చైర్మన్ ఏరుకొండ గణపతి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, ఏఈవోలు ప్రవళిక, సోని, ఎంపీటీసీలు జంబుల తిరుపతి, కట్టెకోళ్ళ రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధానకార్యదరిశ ఏరుకొండ రాజేందర్, పార్టీగ్రామశాఖ అధ్యక్షులు కొడారి రవి, కట్టెకోళ్ళ రాజు, నాయకులు కిష్టయ్య, బుర్ర శ్రీధర్, కట్కూరి సరేందర్, కర్రె అశోక్రెడ్డి, వెంకటేశ్వర్లు, పాండ్రాల స్వామి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.