వరంగల్ చౌరస్తా/వర్ధన్నపేట, సెప్టెంబర్ 21: జిల్లావ్యాప్తంగా మంగళవారం 2919 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన ఇంటింటా సర్వేలో పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ఇంటికి స్టిక్కర్లు అంటించారు. స్పెషల్ డ్రైవ్లో 11,118 మంది మొదటి డోసు, 38,085 మందికి రెండో డోసు టీకాలు వేసినట్లు వెల్లడించారు. ఎనిమిది గ్రామాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. గీసుకొండ పీహెచ్సీ పరిధిలోని మరియాపురం, అలంకానిపేట పీహెచ్సీ పరిధిలో వెంకటాపూరం, మేడిపల్లి పీహెచ్సీ పరిధిలో రుద్రగూడెం, పోపనపల్లిలో వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. డీఎంహెచ్వో వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద పీహెచ్సీని తనిఖీ చేశారు. పీహెచ్సీ పరిధిలోని సబ్ సెంటర్ల వారీగా రికార్డులను పరిశీలించారు. వందశాతం టీకాలు వేయాలన్నారు.
ఎల్లమ్మబజార్లో 100 శాతం..
మట్టెవాడ/కరీమాబాద్/పోచమ్మమైదాన్/నర్సంపేట/నల్లబెల్లి/నర్సంపేట రూరల్/కాశీబుగ్గ, సెప్టెంబర్ 21: వరంగల్ 25వ డివిజన్ ఎల్లమ్మబజార్లో కరోనా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయిటనుల డీఎస్వో వేణుగోపాల్ తెలిపారు. ఇందుకుగాను సహకరించిన కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్కు ఆయన ప్రశంసాపత్రం అందించారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి మహా నగరపాలక సంస్థ, ఐసీడీఎస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి స్థానిక ప్రజలకు కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. వరంగల్ 12వ డివిజన్లోని సెకండ్ డాక్టర్స్కాలనీ, వీవర్స్కాలనీ, స్నేహనగర్, గాంధీనగర్, మైనార్టీకాలనీ, మార్కండేయకాలనీలో స్థానిక కార్పొరేటర్ కావటి కవిత, డాక్టర్ తంగళ్లపల్లి భరత్కుమార్, ఏఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించారు. 22వ డివిజన్లోని మర్రి వెంకటయ్య కాలనీ, రామనాథపురి కాలనీలో వందశాతం పూర్తి చేశారు.
నర్సంపేట పట్టణంలోపాటు డివిజన్లో వందశాతం పూర్తి చేసుందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పట్టణంలో కౌన్సిలర్లు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.నల్లబెల్లి, సెప్టెంబర్ 21 ః వ్వాక్షినేషన్ క్యాంపుకు మండలంలో మంచి స్పందన వస్తోంది. నల్లబెల్లి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీవో కూచన ప్రకాశ్ పరిశీలించారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో మంగళవారం కొవిడ్ టీకా కార్యక్రమం కొనసాగింది. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలు టీకాలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. వరంగల్ కాశీబుగ్గ, ఎనుమాముల, లేబర్కాలనీ, ప్రతాపునగర్లో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు.