Maoists | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతం అయ్యారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసు బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు తారసపడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతం అయ్యారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలకు ఎవరికీ గాయాలు కాలేదు. ఇక పిడియా గ్రామ పరిసరాల్లో కూంబింగ్ కొనసాగుతోంది.