వరంగల్, సెప్టెంబర్ 14: గ్రేటర్ కార్పొరేషన్లో అనధికార హోర్డింగ్లను గుర్తించి క్రమబద్ధీకరించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం టౌన్ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రకటనల హోర్డింగ్ల ద్వారా వచ్చే ఆదాయంపై ఆమె అధికారులతో చర్చించారు. నగరంలోని హోర్డింగ్లు, లాలీపాప్ల టెండర్లు తీసుకున్న సంస్థలు సకాలంతో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రకటనల హోర్డింగ్ల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ బిల్డింగ్స్, యూనియన్ పోల్స్, టీ షెఫ్స్ కాంటిలివర్, లాలీపాప్స్ తదితర ప్రకటనలకు సంబంధించిన పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గడువు ముగిసినా వాటిని వినియోగించుకుంటున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని హోర్టింగ్లపై సర్వే చేయాలన్నారు. వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్న సైన్ బోర్డులకు పన్నులు వసూళ్లు చేయాలన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ వెంకన్న, డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీ భిక్షపతి, ఇన్చార్జి ఏసీపీలు బషీర్, సుష్మ పాల్గొన్నారు.