వాషింగ్టన్: భారత్పై కరోనా విరుచుకుపడుతున్నది. ప్రతిరోజు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా దవాఖానలు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు వెళ్లకూడదని సూచించింది. భారత్లో ఉండటం మంచిదికాదని.. ఇప్పటికే ఉన్నవారు వీలైనంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలని కోరింది. అమెరికాకు ప్రతిరోజు ఇండియా నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటిద్వారా దేశానికి చేరుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లెవల్ 4 ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది.
ఈవారం ప్రారంభంలో భారత్కు విమానాలను రద్దుచేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి బ్రిటన్కు వచ్చేవారు తప్పనిసరిగా 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..