PM Modi | మయన్మార్, థాయ్లాండ్ దేశాలను శుక్రవారం శక్తిమంతమైన భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా విపత్తుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
‘మయన్మార్, థాయ్లాండ్లో భూకంపం పరిస్థితిపై ఆందోళనగా ఉంది. అక్కడి ప్రజలందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నా. అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. సహాయక చర్యలపై మయన్మార్, థాయ్లాండ్ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరాను’ అని ప్రధాని తన పోస్ట్లో పేర్కొన్నారు.
Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…
— Narendra Modi (@narendramodi) March 28, 2025
మయన్మార్ను (Myanmar) శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు వచ్చాయి. ఈ భూకంపం ధాటికి.. థాయ్లాండ్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. థాయ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ (Bangkok)లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించింది.
Also Read..
Earthquake | భూకంపం ధాటికి బ్యాంకాక్లో ఎమర్జెన్సీ విధింపు.. నగరాన్ని వీడుతున్న వేలాది మంది
Earthquake | మయన్మార్, బ్యాంకాక్, చైనాలను వణికించిన భారీ భూకంపాలు.. నేలకూలిన భవనాలు | Watch Video
PM Modi | థాయ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఖరారు