హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పా లనలో రాజ్యాంగం ప్రమాదం లో పడిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘యథా రాజా.. తథా ప్రజా’ అన్న చం దంగా పాలన కొనసాగుతుందని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఆదిలాబాద్లో హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం చేసే తహసీల్దార్ నుంచి కామారెడ్డిలో ఆర్టీఐ ద్వారా నిజాలను బయటపెట్టిన బాధితులపై భౌతికదాడి చేస్తామని బెదిరించే అమాత్యులు.. చివరకు హైడ్రా కమిషనర్ వరకు చట్టాన్ని తుంగలో తొక్కడమే అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులైనా, ఆర్టీఐ అర్జీదారులైనా ప్రభుత్వ స్పందన తొక్కేయడం, బెదిరించడం, బుల్డోజర్లతో కూల్చేయడమేనని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని బొందపెట్టి అనుముల రాజ్యాంగాన్ని ప్రజలపై రుద్దుతున్నట్టు ఆరోపించారు.