బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఖాతాలో మరో రికార్డు జమ కాబోతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్లో పని చేసే ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షల మార్క్ను దాటనున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజాల్లో అక్స్చేంజర్ మాత్రమే ఐదు లక్షల మందికి పైగా సిబ్బందితో సేవలందిస్తున్నది.
భారతదేశంలోనే అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ రంగ సంస్థగా టీసీఎస్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కంటే కూడా అతి పెద్దది. సైనిక బలగాలు, భారతీయ రైల్వేస్తోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి.
కరోనా మహమ్మారి వెంటాడుతున్నా గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ కొత్తగా 40,005 మందిని నియమించుకున్నది. దీంతో టీసీఎస్లో మొత్తం సిబ్బంది సంఖ్య 4,88,469 మందికి చేరుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 40 వేల మందికి క్యాంపస్ సెలక్షన్ల ద్వారా నియమించుకోనున్నది. ఆ తర్వాత కూడా టీసీఎస్ నియామకాలు జరుగుతాయి.
ప్రతిపాదిత 40 వేల మంది ఉద్యోగుల నియామకాలతో మొత్తం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య సుమారు 5.3 లక్షల మందికి చేరువలోకి వస్తుంది. వీరిలో 90 వేల మంది భారత్ ఆవల పని చేస్తున్నారు.
అక్స్చేంజర్ సంస్థలో 5.37 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గతేడాది కాలంలో సుమారు 28 వేల మంది కొత్త ఉద్యోగులు జత కలిశారు. టీసీఎస్ ఈ ఏడాది నుంచి మరింత ఎక్కువ మందిని నియమించుకోనున్నట్లు సంకేతాలిస్తున్నది.
వరుసగా టీసీఎస్లో నియామకాలు ఇలాగే కొనసాగితే, 2,3 ఏండ్లలో అక్స్చేంజర్ సంస్థను దాటేస్తున్నది. తొలుత లక్ష మంది ఉద్యోగుల నుంచి రెండు లక్షల మందికి పెంచుకోవడానికి టీసీఎస్కు నాలుగేండ్లు పట్టింది..
తదుపరి టీసీఎస్ సిబ్బంది ఖాతా మూడేండ్లలో మూడు లక్షలకు, ఐదేండ్లలో నాలుగు లక్షలకు చేరుకుంది. రెండు, మూడేండ్లలోనే ఐదు లక్షల మంది ఉద్యోగులను టీసీఎస్ జత చేసుకున్నది.
టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా నాలుగుసార్లు నేషనల్ క్వాలిఫయ్యర్ టెస్ట్ నిర్వహిస్తుందన్నారు. టీసీఎస్ ప్రత్యేకించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) ఆధారిత బిజినెస్పై ఆధారపడి ముందుకు సాగుతున్నది.
స్మార్ట్గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు