న్యూఢిల్లీ : ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ తరువాత అమెరికా కూడా కరోనా కష్ట సమయంలో భారతదేశానికి సహాయం అందిస్తున్నది. అమెరికా నుంచి 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సోమవారం సాయంత్రానికి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అంతకుముందు ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, భారత్లో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున అక్కడి ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధమని చెప్పారు. ఇప్పుడు భారత్కు మా సాయం అవసరం, మేం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ.. మేం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి, కరోనా యొక్క ఈ సెకండ్ వేవ్ సమయంలో సామగ్రిని వీలైనంత త్వరగా పంపించి ఆదుకుంటామని తెలిపారు.
అంతకు ముందు, టీకా ముడి పదార్థంపై ఉన్న నిషేధాన్ని తొలగించి, వెంటనే భారతదేశానికి ముడిసరుకును సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఔషధ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావల్లా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముడి పదార్థాల ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. భారత్ విజ్ఞప్తి పట్ల అమెరికా సానుకూలంగా ఉన్నదని ఆదేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చెప్పిన కొద్ది సేపటికే ఢిల్లీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వస్తువులు చేరాయి.
భారత్కు ఆక్సిజన్, వెంటిలేటర్, పీపీఈ కిట్లు పంపనున్న ఆస్ట్రేలియా
కరోనా సెకండ్ వేవ్ మీ వల్లే వచ్చింది.. ఈసీకి మద్రాస్ హైకోర్టు మందలింపు
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..