Harish Rao | నర్సింలు అన్న మన ఊరు మన బడిలో స్కూల్ కడిగితే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా బిల్లులు ఇస్తలేడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఎస్డీఎఫ్లో ఊరిలో పనిచేస్తే బిల్లు రాకపోతే ఏం పద్దతి ఇది.. రేపు మనం కూడా ఊరుకుంటమా..? రేపు కాంగ్రెస్ పోయి మనం వస్తం. కాంగ్రెసోని బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరెవరైతే కాంగ్రెసోళ్లు ఇప్పుడు గుత్తాలు పట్టుకుని పనిచేస్తున్నరు కదా.. ఆ కొడుకులకు చుక్కలు చూపించుడే.. ఇప్పుడు నర్సింలు అన్న ఎంత బాధపడ్డడో రేపు వాళ్లకు అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలే అన్నారు. మా నర్సింలు అన్నకు మాత్రం బిల్లు మిత్తీతోని ఇప్పిస్తం. ఒక్క నర్సింలు అన్నకు మాత్రమే కాదు ఏ బీఆర్ఎస్ కార్యకర్తలైతే ఇప్పుడు బిల్లులు రాక బాధపడుతున్నరో.. మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలో మొదటి బిల్లు మీకే ఇస్తమని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఎవరెవరు కాంగ్రెసోళ్లు ఎగిరెగిరి పనులు చేస్తున్నరో చుక్కలు చూస్తరు బిడ్డా మీరు.. మావోళ్లను తిప్పల పెట్టినప్పుడు మిమ్మల్ని విడిచిపెడ్తమా..? మేము.. మీ సంగతి కూడా చెప్తం బరాబర్.. అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
మన ఊరు – మన బడి పథకంలో పాఠశాలను కడితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేస్తలేడు
రేపు మన ప్రభుత్వం వచ్చాక కూడా ఈ కాంగ్రెస్ కొడుకులకు ఒక్క బిల్లు ఇచ్చేది లేదు
బిల్లులు ఆగిపోయిన మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మిత్తితో కలిపి ఇస్తాం.. ఈ కాంగ్రెస్ కొడుకుల పని చేస్తాం
– హరీష్… pic.twitter.com/W1oxGogR0j
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026