హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): బీసీలకు ఇచ్చిన హామీల ను, బీసీలు దశాబ్దాలు చేస్తున్న డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నేతలు బుధవారం ధర్నా చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రక్షణ చట్టం అమ లు చేయాలని, ప్రత్యేక మంత్రిత్వ శా ఖ ఏ ర్పాటుచేయాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా క ల్పించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేశ్ డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్ర బీసీ నేతలు పాల్గొన్నారు.