హైదరాబాద్ : మహిళల భద్రత కోసం ఐటీ కారిడార్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)తో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. షీ షటిల్ను విజయవంతంగా కొనసాగిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ అర్ట్ గేమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందించిన షీ షటిల్ బస్సును శుక్రవారం సీపీ సజ్జనార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ ఐటీ కారిడార్లో 2.5 లక్షల మహిళ ఉద్యోగులు ఉన్నారని, ఎస్సీఎస్సీతో కలిసి తీసుకుంటున్న చర్యలతో మహిళలకు సంబంధించిన నేరాలు తగ్గుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎసీఎస్ఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల తదిరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్