హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని కొత్త పట్టాదారు రైతులకు రాష్ర్ట వ్యవసాయ శాఖ శుభవార్త వినిపించింది. రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ లోపు భూములను రిజిస్టర్ చేసుకున్న రైతులు.. 11వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని వ్యవసాయ శాఖ సూచించింది.
నియమ నిబంధనలు :
-రైతు భూమి 03.08.2021 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
-రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అంటే 14.08.1962 నుండి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి.
-వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం.
-ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది.
-రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.
-ఇప్పుడు మీరు బీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు బీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు.