హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న ఓ అద్భుతమైన జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. సికింద్రాబాద్ నుంచి 43 కిలోమీటర్లు, శంషాబాద్ బస్టాప్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నానాజీపూర్ వాటర్ఫాల్ నగర వాసులను ఆకర్షిస్తోంది. ఈ వాటర్ ఫాల్ సందర్శనలో భాగంగా 17వ శతాబ్దంలో నిర్మించిన అమ్మపల్లి సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు.
అయితే నానాజీపూర్ జలపాతం చూసేందుకు శంషాబాద్ మార్గం గుండా వెళ్లొచ్చు. ఒక వేళ గూగల్ మ్యాప్లో సందిగ్ధత నెలకొంటే.. వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకుని, అక్కడ ఎవర్నీ అడిగినా ఆ జలపాతం అడ్రస్ చెప్పేస్తారు. ఈ వాటర్ఫాల్కు వెళ్తున్నప్పుడు కచ్చితంగా ఆహార పదార్థాలు తీసుకెళ్లాలి. అక్కడ కేవలం ఓ మహిళ మిర్చిబజ్జీ, ఎగ్ బోండా మాత్రమే విక్రయిస్తోంది.