నల్లగొండ : మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలో వస్తే రష్యాలో మాదిరిగా దేశంలో ప్రజాస్వామ్యం ఖతం అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ సవరణ పేరుతో రిజర్వేషన్ల (Reservations) రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు చేస్తామని అనడం దారుణమని అన్నారు. 2013 లో మోదీ (Narendra Modi) ఇచ్చిన హామీలు ఒక్కటికూడా అమలు కాలేదని వెల్లడించారు.
జన్ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు, రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జీఎస్టీ (GST) పేరుతో దేశ ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో అధాని,అంబానీలు బాగు పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. మూసి, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు . అమెరికాలోని కొన్ని కంపెనీలతో ఉద్యోగ కల్పన కు కృషి చేస్తున్నామని వివరించారు.