హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్కు(Cricket betting) పాల్పడుతున్న ముఠాను చైతన్యపురి లా అండ్ ఆర్డర్ పోలీసులు, వనస్థలిపురం ఎస్ఓటీ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొందరు యువకులు రెండు వెబ్ సైట్ల ఆధారంగా మంగళవారం రాత్రి జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్(,IPL Match) పై బెట్టింగ్కు పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న మరో రూ. 12.50 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో నిందితులు అసీం, సాయిప్రసాద్, శివ నారాయణ పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.