హైదరాబాద్ : అకాల వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాలను(Hinterlands) శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Gandhi) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా ఏర్పడిన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్లో జలమయమైన పలు ప్రాంతాలను ఆయన కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈదురు గాలులకు రోడ్లపై కూలిన చెట్లను వీలైనంత త్వరగా తొలగించి, ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలమయమైన ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకూడదని తెలిపారు. ఎమ్మెల్యే వెంట చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, అధికారులు ఉన్నారు.