సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన విలేకరలు సమావేశంలో మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు శాఖ తరఫున చేపట్టే కార్యక్రమాలపై రిహార్సల్స్ జరుగుతున్నాయన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నిర్వహిస్తున్నారని, అదే విధంగా బుధవారం సాయంత్రం నేరుగా గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిపారు. వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పకుండా ముందస్తుగా నగర ట్రాఫిక్ అదనపు సీపీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన సూచనలు ప్రజలకు తెలుపుతామన్నారు. వేడుకలకు వచ్చే వారికి వివిధ రంగులతో కూడిన పాస్లు ఇచ్చి, పార్కింగ్ స్థలాలను కేటాయిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
భర్తను రోకలిబండతో బాది హత్య చేసిన భార్య
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా : స్పీకర్ పోచారం
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ