Dasoju Sravan kumar | వేసవిలో విద్యుత్ కొరత రావడంతో అన్ని రాష్ట్రాల్లో కోతలు విధించారని.. తెలంగాణలో మాత్రం వేసవిలో సైతం రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారని తెలిసిందే. కొన్ని రాష్ట్రాల ప్రముఖులు తెలంగాణను ప్రశంసించారని కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే స్వయంగా డిప్యూటీ సీఎం ఇలా కామెంట్ చేసి 24 గంటలు గడవక ముందే రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో తేట తెల్లమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారో లేదు కరెంట్ కట్ అవడంతో కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు మరోసారి అద్దం పడుతోంది.
నిన్న రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదని భట్టి విక్రమార్క చెప్పిన 24 గంటలలోపే లైవ్లో కరెంట్ కట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రెస్ మీట్లో కరెంట్ కట్
నిన్న రెప్పపాటు కూడా కరెంట్ పోవడం లేదని భట్టి విక్రమార్క చెప్పిన 24 గంటలలోపే లైవ్లో కరెంట్ కట్ https://t.co/vTVIjvoxCC pic.twitter.com/4M89Z8miVS
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2026
Dubai | దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు