Balka Suman | సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఊరట లభించింది. బాల్కసుమన్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బాల్క సుమన్కు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదు కాగా.. గత నెల 29న అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారని తెలిసిందే.
అక్రమ కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్నబాల్క సుమన్ను ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బాల్క సుమన్ 25 రోజుల పాటు జైలులోనే ఉండగా.. ఎట్టకేలకు బెయిల్ లభించింది.