కందుకూరు : మండల పరిధిలోని మాదాపూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వల్లవోజు ఆంజనేయులు ఆకస్మికంగా మృతి చెందాడు. రాచకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందడంతో తోటి ఉద్యోగులు ఆయన కుంటుబానికి ఆర్థిక సహయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆదివారం పలువురు ఉద్యోగులు మాదాపూరు గ్రామానికి వచ్చి ఆయన కుటుంబానికి 3లక్షల 70వేల రూపాయలను అందజేశారు. ఎడీసీపీ సమీర్, ఎసీపీ భాస్కర్, ఆర్ఐ నరేష్, సర్పంచ్ మంద సాయిలుల చేతుల మీదుగా ఆ మొత్తాన్ని చెక్కురూపంలో ఆయన భార్యకు అందజేశారు.
తోటి మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. తమ వంతు సహయంగా వారి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశామని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని ఆయన కుటుంబానికి మనోదైర్యం కల్పించారు.ఎలాంటి ఆపద వచ్చిన తమతో చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో తోటి కానిస్టేబుల్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.