(Foreign Currency Seize) హైదరాబాద్: విదేశీ కరెన్సీతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) లో కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. మరో ఇద్దరు సూడాన్ మహిళల నుంచి కూడా విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
షార్జా వెళ్లేందుకు ఓ వ్యక్తి విమానాశ్రయం వచ్చాడు. అతడిని అనుమానించిన కస్టమ్స్ అధికారులు ఆయన లగేజీని చెక్ చేయగా విదేశీ కరెన్సీ కనిపించింది. 25,000 సౌదీ అరేబియా రియాల్స్, 22,500 యూఏఈ దిర్హామ్లు ఉన్నాయి. ఇండిగో 6ఈ 1405 విమానంలో షార్జాకు వెళ్లేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరెన్సీని స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన నగదు విలువ రూ.8 లక్షలు ఉంటుందని అంచనా. ప్రయాణికుడిని విచారణ నిమిత్తం పోలీసులకు రిమాండ్ చేశారు.
అలాగే, గత నెల 23న హైదరాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఇద్దరు సూడాన్ మహిళల నుంచి రూ.13 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు ఎయిర్ అరేబియా విమానంలో షార్జా మీదుగా సూడాన్ రాజధాని నగరమైన ఖార్టూమ్కు వెళ్లేందుకు వచ్చారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న కరెన్సీలో 970 అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హామ్లు 55,000 ఉన్నట్లు అధికారులు గుర్తించి స్వాధీన పర్చుకున్నారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..