MLA Rajasingh | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఐదేళ్ల గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియడంతో గ్రేటర్ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లిందని తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) , సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్గా విభజిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
జీహెచ్ఎంసీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాలు గెలుపుపై ఆ పార్టీ ఇస్తున్న స్టేట్మెంట్స్పై బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీడియాలో కానీ, మీటింగ్లో కానీ, పేపర్లో కానీ జీహెచ్ఎంసీలో మూడు మేయర్ సీట్లు గెలుస్తామని బీజేపీ స్టేట్మెంట్స్లు అయితే బాగా వస్తున్నయ్. మూడు కాదు.. ఒక్కటి కూడా కాదు.. ఆ ఒక్క మేయర్ సీట్లో సగం స్థానాలు గెలిచి చూపించండి అని రాజాసింగ్ సవాలు విసిరారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
బీజేపీ మూడు మేయర్ సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకుంటుంది
కనీసం ఒక్కటైనా గెలిచి చూపించండి
– బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ pic.twitter.com/jBr6CrCXd0
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026
Read ALso :
Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర
Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్పై నుంచి కిందపడి నవ వధువు మృతి