హైదరాబాద్ : తెలంగాణలో రూ.2వేల కోట్ల పెట్టుబడికి భారతీ ఎయిర్టెల్ ( Bharti Airtel ) కంనెనీ ముందుకొచ్చింది. డేటా స్టోరీజి, విశ్లేషణలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి హైపర్స్కేల్ డేటా సెంటర్ ( Hyperscale Data Centre )ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ట్రా ద్వారా ఎయిర్టెల్ కంపెనీ ఈ పెట్టబడులు పెట్టనుంది.
దావోస్ ( Davos ) లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ) తో భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్ ( Sunil Bharti Mittal ), వైస్ ఛైర్మన్ రాజన్ భారతి మిట్టల్ ( Rajan Bharti Mittal ) భేటీ అయ్యారు. సమావేశం అనంతరం హైదరాబాద్లో రూ.2వేల కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రాబోతుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తెలంగాణలో ఎయిర్టెల్ పెట్టుబడులు పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్టెల్-నెక్స్ట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని అన్నారు.
#TriumphantTelangana bags major investment – Bharti Airtel Group @airtelindia to set up large Hyperscale Data Centre in Hyderabad with ₹2000 Cr.
The announcement came after the Group’s Founder & Chairman Sunil Bharti Mittal, VC Rajan Bharti Mittal met Minister @KTRTRS at #wef23 pic.twitter.com/9PVErOR2K8
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 18, 2023
Read More :
Eurofins | హైదరాబాద్కు మరో కంపెనీ.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన యూరోఫిన్స్