హైదరాబాద్ : హైదరాబాద్కు మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో కూడిన ల్యాబ్ను హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్టు యూరోఫిన్స్ ( Eurofins ) సంస్థ ప్రకటించింది. దాదాపు రూ.1000 కోట్లతో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఆహారం, పర్యావరణం, ఫార్మాస్యూటికల్, కాస్మోటిక్ ఉత్పత్తుల పరీక్షలు.. బయో అనలిటికల్ టెస్టింగ్లో ఫ్రాన్స్కు చెందిన యూరోఫిన్స్ గ్లోబల్ లీడర్గా ఉంది. హైదరాబాద్లో ప్రారంభించే అధునాతన టెస్టింగ్ ల్యాబ్తో భారతీయ ఔషధ మారెట్లో విస్తరించబోతుంది. తన అనుబంధ సంస్థ యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా హైదరాబాద్లో ఈ ల్యాబ్ను యూరోఫిన్స్ ఏర్పాటు చేస్తోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమైన యూరోఫిన్స్ ప్రతినిధి బృందం తమ విస్తరణ ప్రణాళికలను చర్చించింది. అనంతరం యూరోఫిన్స్ సీఈవో డాక్టర్ గిల్లెస్ మార్టిన్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేయబోయే క్యాంపస్తో ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో హైదరాబాద్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
A great boost & major investment for the Telangana Pharmaceutical Sector!
Eurofins, a global leader in Pharma & Bioanalytical Testing, has announced establishment of a fully-equipped, state-of-the-art laboratory campus in Genome Valley, Hyderabad.#WEF23#TelanganaAtDavos pic.twitter.com/MFo5ILZnBy
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 18, 2023
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ ప్రవేశిస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. యూరోఫిన్స్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని తెలిపారు.