ఆదిలాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్లో ఏర్పాటు చేయను న్న విమానాశ్రయంలో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.6 కోట్లు చెల్లించాలని, పునరావాసం కల్పించాలంటూ బుధవారం అనుకుంటకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామానికి చెందిన రహదారితోపాటు సగం ఇండ్లు పోతున్నాయనే ప్రచారం జరుగుతున్నదని, అధికారులు ఈ విషయంలో స్పష్ట త ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం తాము రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆదిలాబా ద్ పట్టణానికి చేరుకుంటున్నామని, రోడ్డుపోతే 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు. తమ పిల్లలు చదువులకు దూరం కావడంతోపాటు చిరు ఉద్యోగాలు చేసే వారికి ఉపాధి లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు తమ డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన తర్వాత భూ సేకరణ చేపట్టాలని రైతులు కోరారు.