మారేడ్పల్లి, ఆగస్టు 20 : రైల్లోంచి(Train) ప్రమాదవశాత్తు జారిపడి(Train accident) గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మౌలాలి-లాలాగూడ రైల్వే స్టేషన్ల మధ్యన గుర్తు తెలియని ఓ వ్యక్తి రైల్లోంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వయసు సూమారు (35) సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.