న్యూఢిల్లీ: 17 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్ నెలకొల్పిన టీ20 రికార్డును సమోవా క్రికెటర్ బ్రేక్ చేశాడు. ఆ దేశానికి చెందిన బ్యాటర్ డారియస్ విస్సేర్.. టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించారు. టీ20 మ్యాచ్లోని ఒక్క ఓవర్లోనే అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్గా నిలిచాడు. వనాటు దేశంతో జరిగిన మ్యాచ్లో అతను ఈ రికార్డును సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్ ఏ ఈవెంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఏపియాలో జరిగిన మ్యాచ్లో విస్సేర్ ఒక్క ఓవర్లోనే 39 రన్స్ చేశాడు.
🚨WORLD RECORD CREATED IN MEN’S T20 LEVEL 1 OVER 39 RUNS
Darius Visser scored 39 runs in match between Samoa Vs Vanuatu
(🎥 – ICC)#T20 #T20WorldCup #records #ICC #CricketUpdate #cricketnews pic.twitter.com/sXiyrlxjtE— SportsOnX (@SportzOnX) August 20, 2024
క్వాలిఫయర్ ఏ మ్యాచ్ 15వ ఓవర్లో విస్సేర్ భారీ షాట్లతో అలరించాడు. ఆ ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. స్పీడ్ బౌలర్ నలిన్ నిపికో ఆ ఓవర్లో మూడు నో బాల్స్ వేశాడు. 2007లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క ఓవర్ లో 36 రన్స్ స్కోర్ చేసిన క్రికెటర్లలో ఇతరులు కూడా ఉన్నారు. 2021లో కీరన్ పోలార్డ్ 36, 2024లో నికోలస్ పూరన్ 36 రన్స్, దీపేంద్ర సింగ్ 36 రన్స్ స్కోర్ చేశారు.
నిపికో వేసిన తొలి మూడు బంతుల్లో విస్సేర్ మూడు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత రెండు నోబాల్స్ పడ్డాయి. ఇక నాలుగో లీగల్ డెలివరీలికి మరో సిక్సర్ కొట్టాడు. అయిదో బంతిని డాట్ బాల్గా వేశాడు. కానీ ఆ తర్వాత మూడో నో బాల్ను మరో సిక్సర్గా మలిచాడు విస్సేర్. ఆ తర్వాత చివరి బంతిని కూడా సిక్సర్గా కొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ కొట్టిన తొలి సమోవా క్రికెటర్గా విస్సేర్ నిలిచాడు.
విస్సేర్ ఇన్నింగ్స్లో మొత్తం 14 సిక్సర్లు ఉన్నాయి. 62 బంతుల్లో అతను 132 రన్స్ చేశాడు. దీంతో ఈ టోర్నీలో సమోవా జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. 2026లో టీ20 వరల్డ్కప్ కోసం క్వాలిఫై అయ్యేందుకు ఆ జట్టు ప్రయత్నిస్తోంది.