ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికతో బొడిశెట్పల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాభివృద్ధి జరుగుతున్నది. గ్రామమంతా పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలను పోత్సహిస్తూ శ్రమదానం చేయిస్తున్నారు. రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.5లక్షలతో సీసీ రోడ్లు, రూ.6లక్షలతో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో ఎప్పటికప్పుడు గ్రామసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు.
మునిపల్లి, ఏప్రిల్ 1: పల్లెలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో మండల పరిధిలో ని బొడిశెట్పల్లి పంచాయతీ అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికతో బొడిశెట్పల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పట్టించారు. పల్లె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలు కీలకంగా వ్యవహరిస్తున్నా రు. పచ్చదనం, పరిశుభ్రతతో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పల్లెలను అభివృద్ధిలో నడిపేందుకు 30 రోజుల ప్రణాళిక ఎంతో ఉపయోగపడింది. సమగ్ర గ్రామీణ విధానానికి రూపకల్పన చేయడంతోపాటు గ్రామమంతా పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. అభివృద్ధికి జై కొడుతూ బొడిశెట్పల్లి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తున్నా రు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలను ప్రోత్సహి స్తూ శ్రమదానం చేయిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతు న్న 30రోజుల ప్రణాళికతో గ్రామ రూపురేఖలు మార్చా రు. ప్రజలందరూ కలిసి ఉంటేనే గ్రామాలు అభివృద్ధి పథం లో నడుస్తుందన్న మాటకు నిదర్శనంగా బొడిశెట్పల్లి ప్రజలు గ్రామాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు.
రూ.12.50 లక్షతో వైకుంఠధామం…
బొడిశెట్పల్లిలో ప్రభుత్వం రూ.12లక్షలతో వైకుంఠధామం నిర్మించింది. వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తి చేయడంతో గ్రామస్తులకు అందుబాటులోకి వస్తుంది.
డంపింగ్ యార్డుకు తడి, పొడి చెత్త
గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది. తడి -పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు ప్రజలకు గ్రామ సభలు నిర్వహించి ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు చెత్తను సేకరించే వాహనం ఇంటింటికీ రావడంతో అందులో తడి -పొడిచెత్త వేర్వేరుగా తీసుకెళ్తున్నారు. రూ.2.50లక్షలతో డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. .
సీసీరోడ్ల నిర్మాణం…
గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్లు నిర్మా ణం చేపట్టారు. గ్రామంలో అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలంటూ అందో ల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్కు వినతిపత్రం అందించారు.
రూ.6లక్షతో పల్లెప్రకృతి…
పల్లెప్రకృతి వనం బొడిశెట్పల్లిలో రూ.6లక్షల తో నిర్మాణం చేస్తున్నా రు. పల్లెప్రకృతి వనం లో ఇతర ప్రాంతాల నుంచి పూలు, పండ్ల మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తయారు చేశారు.
ఇవీ కూడా చదవండీ..
అధికార పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
నేటి నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్
బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ కార్యకర్త హత్య