కోల్కతా : పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాద్పూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పశ్చిమ మిడ్నాపూర్ ఎస్పీ తెలిపారు. దాద్పూర్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
పోలింగ్ ఏజెంట్ను చుట్టుముట్టిన టీఎంసీ కార్యకర్తలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండో విడుత ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నౌపరాలోని పోలింగ్ బూత్ నం. 22లో బీజేపీ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ను 150 మంది టీఎంసీ కార్యకర్తలు చుట్టుముట్టారని భారతి ఘోష్ పేర్కొన్నారు. ఘోష్ దేబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమ ఏజెంట్లను టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించారు.
ఇవీ కూడా చదవండి..