హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం తెలంగాణలోని పలు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna reddy) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎకస్ నేతలు, తదితరులు ఉన్నారు.