వనపర్తి : ప్రమాదవశాత్తు ఇల్లు కూలిన సంఘటనలో సర్పంచ్ సహా ఆమె మనువడు మృతి చెందారు. విషాదకర ఘటన రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ (51), ఆమె మనువడు యోగేశ్వర్ (7) నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టి మిద్దె కూలిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సర్పంచ్ మృతిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు.