బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 2 : యాసంగిలో సాగుచేసిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపేట్ సహకార సంఘం పరిధిలోని రాంపూర్తండాలో ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలతో రైతులు నష్టపోతారని గ్రహించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించడంపై సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 442, కామారెడ్డి జిల్లాలో 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏ – గ్రేడ్ రకం ధాన్యానికి రూ. 1,888, బీ- గ్రేడ్ రకానికి రూ. 1,868 మద్దతు ధరను ప్రభుత్వం అందజేస్తున్నదని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం జలాలను త్వరలోనే నిజాంసాగర్లోకి తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంజీరా నదిపై నాలుగు చెక్డ్యాములు, ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, ఏడీఏ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ హరిసింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్సింగ్, ఇబ్రహీంపేట్ సర్పంచులు నారాయణరెడ్డి, పీర్సింగ్, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్రెడ్డి, ఎజాస్, భూషణ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మొగులయ్య, జ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
బాయ్ఫ్రెండ్ చీటింగ్ను.. ప్రియురాలికి పట్టిచ్చిన స్మార్ట్ వాచ్
హింసను ఆపండంటూ నేనూ మోకాళ్లపై ప్రాధేయపడతా: పోప్ ఫ్రాన్సిస్
చైనాది అణచివేత ధోరణి: అమెరికా విదేశాంగ మంత్రి
1900 ఏండ్లనాటి రాతప్రతులు లభ్యం