గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాకు చెందిన రామావత్ వాల్యానాయక్ను ప్రభుత్వం నియమించింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ను వాల్యానాయక్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రికి తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా వాల్యానాయక్ను నియమించడంపై బాలానగర్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.