మిడ్జిల్, సెప్టెంబర్ 16 : సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులేన ని జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ అన్నారు. గురువారం మి డ్జిల్ ఎమ్మార్సీ భవనంలో ఎంఈవో మంజులాదేవి ఆధ్వర్యంలో ఉత్త మ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సన్మానం పొందినవారిలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత రవిశంకర్, జిల్లాస్థాయి అవార్డుగ్రహీతలు ఎంఈవో మంజులాదేవి, మోహన్, కొత్తూర్ పరుశరాములు, చిల్వేర్ గురుప్రసాద్గౌడ్, మసిగుండ్లపల్లి శ్వేత, కాటోనిగడ్డతండా రవికుమార్, దోనూర్ లక్ష్మయ్య, అయ్యవారిపల్లి హజిరీబేగం ఉన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీటీసీ గౌస్, ఎస్సై అశోక్బాబు, ఉపాధ్యాయులు రవికుమార్, సుధాకర్, నర్సింహులు, వెంకటయ్య, వసంత్కుమార్, మల్లయ్య, పర్వతాలు, హేమలత, సతీశ్, కృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.