వనపర్తి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రైతులు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు సం బంధించిన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం 500 నుంచి 1000 ఎకరాల భూమి సేకరించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో భూములను గుర్తించారు. రైస్మిల్లులు, బియ్యం అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పూలు, కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు, కో ళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేయనున్నా రు. ఇదిలా ఉండగా, ప్రాజెక్టులతో నీటి సామర్థ్యం పెరి గి జిల్లాలో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. వ రి, జొన్నలు, కంది, వేరుశనగ పంటలు అధికంగా సా గు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ జోన్ ఏ ర్పాటు చేస్తే పంటలకు మంచి ధర రావడంతోపాటు నిరుద్యోగులకూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, పాడి, మత్స్య రంగాల్లో ఘననీయమైన అభివృద్ధి కొనసాగుతున్నది. మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా పది జోన్లు మంజూరు చే యగా.. అందులో వనపర్తి జిల్లాకు ఒకటి వచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేయూత..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆర్ధిక చేయూతనివ్వడంతోపాటు ప్రాధాన్యత కల్పించనున్నారు. రాయితీ లు, రుణ సౌకర్యం, వడ్డీ మాఫీ ఇలా అనేక రకాల ప్రో త్సాహకాలు అందించనున్నారు. ప్రాసెసింగ్ జోన్లో పరిశ్రమలు నెలకొల్పేవారికి విద్యుత్ బిల్లులో రాయితీ ఇవ్వనున్నారు. ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత ఉండనున్నది. రైస్మిల్లులు నెలకొల్పేందుకు స్థలం కేటాయించనున్నారు.
స్థలాల గుర్తింపు..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు ఇప్పటికే జి ల్లాలో రెండు ప్రాంతాల్లో స్థలాలు గుర్తించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. వనపర్తి జిల్లాలో భూ మి అనువుగా ఉండడం కూడా జోన్ ఏ ర్పాటుకు కారణమవుతున్నది. పట్టా భూమి ఉన్నా.. నష్టపరిహారం చె ల్లించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. జోన్ పరిధి చుట్టూ 500 మీటర్ల వరకు బఫర్జోన్ స్థలం ఉంచాలి.
స్థలాన్ని పరిశీలిస్తున్నాం..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు భూమి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశాం. అనుమతి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రాసెసింగ్ జోన్కు సంబంధించిన భూమి జిల్లాలో అందుబాటులో ఉన్నది. జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ భూమితోపాటు అక్కడక్కడా భూములు కూడా ఉన్నాయి.