వడ్డేపల్లి, జూలై3: పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యంతోపాటు మొక్కలు నాటే కార్యక్రమంలో అశ్రద్ధ చూపరాదని అదనపు కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. జూలేకల్, శాంతినగర్లో ఆయన పర్యటించారు. రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల ప్లాంటేషన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీర్చాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో చైర్పర్సన్ కరుణ, కమిషనర్ పల్లారావు, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో భాస్కర్ పాల్గొన్నారు.
మొక్కల పంపకంపై ప్రత్యేక దృష్టి
అయిజ రూరల్, జూలై3: మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష అధికారులు, సర్పంచులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా శనివారం మండలంలోని సంకాపురం గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిప్రకాశ్, సర్పంచ్ సుజాత, సింగిల్ విండో డైరెక్టర్ రాముడు, కార్యదర్శి రాఘవేంద్ర, టీఏ అశోక్, వార్డు సభ్యులు మహబూబ్ బాషా, నాగరాజు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనుల పరిశీలన
రాజోళి, జూలై3: మండలంలో చేపట్టిన పల్లెప్రగతి పనులను శనివారం అదనపు కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. అనంతరం రాజోళిలో పర్యటించి, పల్లెప్రగతి పనులను ఉపసర్పంచ్ గోపాల్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్ను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ నారాయణ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కను నాటారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు డీఆర్డీవో నాగేంద్ర, మండల ప్రత్యేకాధికారి ప్రసాద్రావు, ఎంపీడీవో గోవింద్రావు, ఎంపీవో ఖాజామొద్దిన్, ఉపసర్పంచ్ గోపాల్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు.
అలంపూర్ 2వ వార్డులో..
అలంపూర్, జూలై3: పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమవెంకటేశ్, కమిషనర్ నిత్యానంద్ శనివారం పరిశీలించారు. అలంపూర్ 2వ వార్డులో గుంత మూసివేత పనులను పరిశీలించారు. వర్షపు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్ చంద్రశేఖర్కు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు సామెలు, శీను పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: సీఐ
ఎర్రవల్లి చౌరస్తా, జూలై3: ఇటిక్యాల మండలంలోని కోదండాపూర్ గ్రామంలో శనివారం సీఐ వెంకట్రామయ్య, ఎస్సై వెంకటస్వామి, ఏఎస్సై సత్యం సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
పుల్లూరులో..
ఉండవెల్లి, జూలై3: మండలంలోని పుల్లూరు గ్రామంలో పల్లెప్రగతి, హరితహారం పనులను మండల ప్రత్యేకాధికారి భీమేశ్వరరావు, ఎంపీడీవో జెమ్లానాయక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో సంరక్షించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును ఆదేశించారు.