గద్వాల : జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలోనకిలీ కరెన్సీ చెలామణికి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
శాంతినగర్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా పైపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్, పుల్లన్నలు కర్నూలు జిల్లా కేంద్రం రాజ్విహార్ సెంటర్లోని జగదీష్ ఎలక్ట్రానిక్స్లో శనివారం టీవీ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.
టీవీ కొనుగోలు చేసి దుకాణం యజమాని సురేశ్కు రూ.2 వేల నోట్లు ఇచ్చారు. అనుమానం వచ్చి నోట్లను పరిశీలించిన సురేశ్ నకిలీవని గుర్తించి కర్నూలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆదివారం కర్నూల్ పట్టణ ఎస్ఐ సునీల్ సహకరంతో శాంతినగర్ ఎస్ఐ శ్రీహరి పైపాడు గ్రామంలోని పుల్లన్న, రాజశేఖర్ ఇళ్లలో తనిఖీ చేయగా రూ.లక్షా 50 వేల విలువైన రూ. 2 వేల నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.