వికారాబాద్/పరిగి టౌన్, మే 4 : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపీవోలకు శిక్షణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహార తిలతో కలిసి పరిశీలించారు. పరిగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వ హించిన ఓపీవోల శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. అతి నమ్మకంతో వెళ్లకుండా ఏదైనా సందేహం ఉంటే ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్ బుక్ చూసి నివృత్తి చేసుకోవాలన్నా రు. చేవెళ్ల లోక్సభ నుంచి 43 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున 3 బ్యాలెట్ యూనిట్లను కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రిని తీసుకొని వెళ్లడం మొదలుకొని తిరిగి ఈవీఎంలను పంపిణీ కేంద్రానికి జాగ్రత్తగా తీసుకురావాలన్నారు. అనంతరం మేరీనాట్లోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను సందర్శించారు.
పోలింగ్ కేంద్రాలకు పంపించే సామగ్రిని సిద్ధంగా ఉంచాలని మండల తహసీల్దార్ లక్ష్మీనారాయణకు సూచించారు. వికారాబాద్లోని ఓపీవోల శిక్షణలో ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనీ వీరకాంతం ఉన్నా రు. పరిగిలో జరిగిన కార్యక్ర మంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, అసిస్ట్టెంట్ రిటర్నింగ్ అధికారి వాసుచంద్ర, తహ సీల్దార్లు ఆనం ద్రావు, తిరుప తయ్య, రమాదేవి, ప్రవలింగం, మురళి పాల్గొన్నారు.