తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే.
మంగళవారం తమ నివాసంలో విలేకరులతో వారు మాట్లాడుతూ.. గోపాల్ అనారోగ్యంతో దవాఖానలో ఉండగా కేటీఆర్ సార్ ఆదుకున్నట్టు చెప్పారు. దవాఖాన ఖర్చులతోపాటు అంత్యక్రియల ఖర్చులను ఆయనే చూసుకున్నారని, ఆర్థిక సాయం పంపించి ధైర్యంగా ఉండాలని చెప్పినట్టు వివరించారు.
– రాజన్న సిరిసిల్ల