Srikalahasti | తిరుమల యాత్రకు వెళ్లినప్పుడు చివరిగా శ్రీకాళహస్తికి వెళ్లాలనీ, ఆ తర్వాత మరే క్షేత్రమూ దర్శించకుండా తిరుగు ప్రయాణం కావాలని నియమం ఏమైనా ఉందా. వివరించగలరు?
– శ్రీనివాస్, కోరుట్ల
తిరుమల తిరుపతి మొదలైన పుణ్య క్షేత్రాలు వరుసగా సందర్శించేటప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చివరి క్షేత్రంగా చేసుకోవాలన్న విశ్వాసం లోకంలో ఉన్నది. అక్కడితో యాత్ర ముగించి ఇంటికి రావాలని అంటారు. కానీ, ఈ విషయానికి సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు కనిపించవు. ఇది లోకాచారం మాత్రమే! శ్రీకాళహస్తి క్షేత్రం యోగ సంబంధమైన జ్ఞానం ప్రసాదించే దివ్యధామం. దీనికి తగ్గట్టే అక్కడ కొలువుదీరిన అమ్మవారికి జ్ఞానప్రసూనాంబ అన్న పేరు గమనించవచ్చు. యోగ సంబంధమైన జ్ఞానం సిద్ధించిన తర్వాత ఇక తీర్థయాత్రలతో పనిలేదనే అభిప్రాయంగా ఈ ఆచారం వ్యవహారంలోకి వచ్చింది.
“పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?”