భద్రాద్రి: దక్షిణాది అయోధ్య భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలతో బేడా మండపంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠాపన, దేవతాహ్వాన కార్యక్రమాలు ఉంటాయి. రేపు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. బుధవారం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గురువారం (ఈనెల 22న) శ్రీరాముని మహాపట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది.
కాగా, బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 27 వరకు అధికారుల స్వామివారి నిత్యకల్యాణాలు నిలిపివేశారు. నేటినుంచి ఈనెల 30 వరకు అంతరాలయంలో భక్తుల పూజలను ఆపివేశారు. కరోనా నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థప్రసాదాలు నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. సీతారాముల కల్యాణం, రాముని మహాపట్టాభిషేకం నేపథ్యంలో ఈనెల 21, 22న అన్ని రకాల దర్శనాలు రద్దుచేశామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..