‘లెనిన్’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. రూరల్ బ్యాక్డ్రాప్ కథతో ‘లెనిన్’ని తెరకెక్కించిన ఆయన.. తన నెక్ట్స్ సినిమాకు కూడా అదే నేపథ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. అయితే.. ఈసారి పాత్రలు, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయట.
తమిళ అగ్ర నటుడు ధనుష్ ఇమేజ్కి సరిగ్గా సరిపోయేలా మురళీకిశోర్ ఈ కథను డిజైన్ చేశారట. త్వరలోనే ధనుష్కి కథ వినిపించనున్నట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.