మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. సామాజిక నేపథ్యంలో కమర్షియల్ చిత్రంగా సర్కారు వారి పాట చిత్రం తెరకెక్కుతుండగా, ఇప్పటికే ఈ చిత్రం దుబాయ్లో కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుకుంది. ఇక రీసెంట్గా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రెండో షెడ్యూల్ మొదలు పెట్టారు.షూటింగ్ మొదలైన నాలుగు రోజులకే చిత్రీకరణ ఆపేశారు.
సర్కారు వారి పాట’ సెట్లోను కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్లో చిత్ర షూటింగ్ జరుగుతుండగా, యూనిట్లో కీలక వ్యక్తి ఒకరు కరోనా బారిన పడటంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేశారు. చిత్ర షూటింగ్లో పాల్గొన్న వారందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. కాగా, కరోనా నేపథ్యంలో మహేష్ తాను చేయాల్సిన యాడ్ షూటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు.