లుధియానా: ఫ్యాక్టరీ ప్రాంగణంలో నివాసముంటున్న ఓ బాలికపై కార్మికుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలి తండ్రితో కలిసి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించాడు కూడా. సంఘటన బయటపడగానే పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు.
లూథియానాలోని సాహ్నేవాల్లో ఉండే ఓ ఫ్యాక్టరీలో ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడి కుటుంబం ఉంటున్నది. కరోనా వ్యాప్తి కారణంగా తల్లి యూపీలోనే ఉండగా.. వారి 14 ఏండ్ల కుమార్తె పాఠశాలలు ప్రారంభించారని తెలిసి లూథియానాకు వచ్చింది. తండ్రితో కలిసి ఫ్యాక్టరీ ఆవరణలోని క్వార్టర్లో ఉంటున్నది. బాలికను అప్పుడప్పుడు స్కూల్ వద్ద దింపడం, ఇంటికి తీసుకురావడం చేస్తూ ఇదే ఫ్యాక్టరీలో పనిచేసే మరో కార్మికుడు దగ్గరయ్యాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నది గమనించి.. ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 14 ఏళ్ల బాలికపై ఫ్యాక్టరీలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని బాలికను బెదిరించాడు. సాయంత్రం తండ్రి ఇంటికి తిరిగిరాగానే జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు సహనేవాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ తెలిపారు. నిందితుడిపై పోక్సో, ఐపీసీ 4, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
బార్బీ డాల్లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర
ఏవీ లేని ఈ కాటేజ్కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు : సీఎం తండ్రిపై కేసు నమోదు
స్మశానంగా మార్చినా.. ఈ స్థలాన్ని వదిలిపెట్టం : రాకేశ్ తికాయత్
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..